సూపర్స్టార్ మహేష్ బాబు దాదాపుగా వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ఉంది. ప్రతిదీ ఆచితూచి వ్యవహరిస్తారు. కానీ ఆయన చేసే యాడ్స్ ఈ మధ్య వివాదాల్లో నిలుస్తున్నాయి. తెలుగులో అత్యధికంగా ప్రకటనల్లో (Mahesh babu Ed Case)నటిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబేనని చెప్పవచ్చు. ఈ మధ్య తన యాడ్స్ కారణంగా వరసగా వివాదల్లో నిలుస్తున్నారు. గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ చేస్తూ మొదలుపెట్టి, చక్రసిద్ధ వైద్యాన్ని ప్రచారం చేయడం వంటి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు ఆయన ఇమేజ్ను కాస్త తగ్గించాయి అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపడంతో తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురైంది.
విషయం ఏమిటంటే?
మహేష్ బాబుకు నోటీసులు జారీచేసి ఈడీ, ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవల బన్నీ అరెస్ట్తో షాక్ తిన్న తెలుగు సినిమా పరిశ్రమకు ఇది మరో పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
అయితే ఆయన్ను విచారణకు పిలిపించినంత మాత్రాన నేరస్తులుగా భావించడం తప్పు. కానీ, ఒకసారి సెలబ్రిటీలపై ఇలాంటి ఆరోపణలు వస్తే, అవి సమాజంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. నేటి సోషల్ మీడియా యుగంలో ఇలాంటి నెగెటివ్ వార్తలు వ్యక్తిగత ఇమేజ్ను దారుణంగా దెబ్బతీస్తాయి.
కారణం ఏమిటి?
మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్ నుండి యాడ్స్ కోసం ₹5.9 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ₹3.4 కోట్లు చెక్ ద్వారా, ₹2.5 కోట్లు నగదుగా తీసుకున్నారని సమాచారం. అయితే ఇక్కడే అసలు పేచీ మొదలైంది.
చట్టపరమైన అంశాలు
ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలపై అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు విక్రయించడం, మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలలో మనీలాండరింగ్ జరిగిందని అనుమానాలు ఉన్నాయి. మహేష్ బాబు ఈ కంపెనీల(Mahesh babu Ed Case) యాడ్స్ కోసం డబ్బు తీసుకున్నారని ఈడీ పేర్కొంది. అందుకే ఈ కేసుల్లో ఆయనను కూడా విచారణలో భాగం చేశారని వివరించింది. ముఖ్యంగా నగదు రూపంలో తీసుకున్న ₹2.5 కోట్లపై ఈడీ ఆరా తీస్తోంది.
సెలబ్రిటీలకు పాఠం
మోసపూరిత సంస్థలకు ప్రచారం చేస్తే సెలబ్రిటీలు కూడా జవాబుదారులవుతారని చట్టం స్పష్టంగా చెబుతోంది. మహేష్ బాబు ఈ కంపెనీల అక్రమ కార్యకలాపాలను తెలియకుండా ప్రచారం చేశారంటూ చెప్పినా, చట్టం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోదు.
సినీ పరిశ్రమపై ప్రభావం
భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్, సురానా గ్రూప్, మరియు సాయి సూర్య డెవలపర్స్ లాంటి సంస్థలపై ఇప్పటికే తెలంగాణ పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈడీ ఆర్థిక అక్రమాలపై మరింత లోతుగా విచారణ చేస్తోంది.
జాగ్రత్త అవసరం
ఈ ఆరోపణలు నిజమో కాదో ఇంకా తేలాల్సి ఉంది. మహేష్ బాబు వంటి ఇమేజ్ కలిగిన నటుడు ఇలాంటి వివాదాల మధ్య చిక్కుకోవడం నిజంగా బాధాకరం. (Mahesh babu Ed Case)తన కూతురు సితారతో కలిసి యాడ్స్ చేస్తున్నా, ప్రతి యాడ్పై పదిసార్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ ఘటన సూచిస్తుంది.
ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. కానీ, సెలబ్రిటీలు తమ బ్రాండ్ ప్రమోషన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. మరోవైపు మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక చోప్రాపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
